జనసేనలో చేరికలు
రాజానగరం, “ఒక కొత్త తరం జాతికి నిర్ధేశం చేసే సమయం వచ్చింది. నేను నడిచి చూపిస్తా మీరూ నడవండి“ అన్న ఒక మహా నాయకుడు స్వరం, మహా వృక్షమైనా చిన్న విత్తుతో మొదలవుతుంది. ఈరోజున 7 శాతం నుంచి 27 శాతానికి రేపటి రోజున ఆ 27 శాతం ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయికి జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశా నిర్ధేశంలో కలిసి నడుస్తాం అంటూ కోరుకొండ మండలం, మధురపూడి గ్రామానికి చెందిన పిల్ల అన్నవరం, నర్రావుల రాజు అలుపెరగని మహా నాయకుడు, నిస్వార్ధ పరుడు, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి బత్తుల బలరామకృష్ణ సారధ్యంలో ప్రజలతో మమేకమై ప్రజాక్షేత్రంలో అయన చేస్తున్న మంచి పనులు, ప్రజలకి ఆపత్కాలంలో నేనున్నాను అంటూ ధైర్యాన్ని కల్పించిన నాయకుడి నాయకత్వం మెచ్చి నేడు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరికి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పార్టీ కండువా కప్పి సాదర ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మధురపూడి గ్రామ జనసేన నాయకులు, జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-08-at-16.00.39-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-08-at-16.00.43-1024x768.jpeg)