పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

  • కాళ్ళ కళావతిని పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం, రాజానగరం మండలం వెలుగుబంధ గ్రామానికి చెందిన కాళ్ళ పెద్ద కాపు భార్య కాళ్ళ కళావతి టైఫాయిడ్ జ్వరంతో రక్తహీనత కారణంగా ఆర్.కె హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్న విషయం తెలుసుకుని వారిని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న రాజానగరం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వేగిశెట్టి రాజు, తోట అనిల్ వాసు గారు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • వేమగిరి సుబ్బారావుని పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం, రాజానగరం మండలం, పాలచర్ల గ్రామానికి చెందిన వేమగిరి సుబ్బారావుకి ఇటీవల ఏక్సిడెంటులో కాళ్ళకి గాయమై రాజమండ్రి సాయి హాస్పిటల్ నందు చికిత్స చేయించుకుంటున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వారి కుటుంబసభ్యులతో మాట్లాడి దైర్యం చెప్పారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని రాజానగరం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గంగిశెట్టి రాజేంద్ర, బుద్దాల అర్జునరావు, వేమగిరి పండు, కొమ్ము శ్రీను, వేమగిరి రాజా, సూరపురెడ్డి రాజారావు, కొత్తపల్లి బుజ్జి, అడ్డాల దొరబాబు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • నిడదవోలు శ్రీనుని పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం, కోరుకొండ మండలం, నరసాపురం గ్రామానికి చెందిన నిడదవోలు శ్రీను అనారోగ్యంతో రాజమండ్రి స్మార్ట్ హాస్పిటల్ నందు చికిత్స చేయించుకుంటున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వారి కుటుంబసభ్యులతో రాజానగరం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడి దైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కోరుకొండ మండల సీనియర్ నాయకులు అడ్డాల శ్రీనివాస్, మట్టా నాగేశ్వరరావు, ప్రగడ దేవి వరప్రసాద్, బొజ్జాపు సత్యనారాయణ, ప్రగడ జోగారావు, అడ్డాల దుర్గ, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.