కృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన సోమరౌతు బ్రహ్మం

వేమూరు, మాదిగల మహాత్ముడు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు వేమూరు నియోజకవర్గం వేమూరు సెంటర్లో బాబూ జగజ్జీవన రావ్ విగ్రహం సెంటర్ నందు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించటం జరిగింది. ఈ దీక్షకు ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా ఇంఛార్జి వర్ల దేవదాసు మాదిగ పాల్గొన్నారు. ఈ దీక్షలు ఈ నెల 22 వ తేదీ వరకు జరగాలని పార్లమెంటులో ఎస్సి వర్గీకరణ బిల్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు వేమూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మూరాల వాసుదేవ గౌడ, జనసేన పార్టీ నాయకులు సోమరౌతు బ్రహ్మం మద్దతు తెలిపి కృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వై. దాసు మాదిగ, జంపని నుంచి ఆలపాటి రాకేష్ మాదిగ, పోతుమర్రు నుంచి ఎలిషా మాదిగ పాల్గొన్నారు.