జనసేన మద్ధతుతో అడ్డతీగలలో టిడిపి బంద్ విజయవంతం

రంపచోడవరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ తలపెట్టిన శాంతియుత బంద్ కు జనసేన పార్టీ అడ్డతీగల మండల జనసేన నాయకులు మద్దతు తెలిపారు. అడ్డతీగల మండల హెడ్ క్వార్టర్ లో బంద్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జనసేన పార్టీ అడ్డతీగల మండలం నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, కట్ట ప్రసాద్, కర్ర నర్సయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.