జనసేన బూత్ కమిటీ నియామకం

పాడేరు నియోజకవర్గం: జనసేన పార్టీ బూత్ కమిటీ నియామకాల లిస్ట్ నియోజకవర్గ పరిధిలోని మొట్టమొదటి సారిగా తుది జాబితా తయారు చేసి ముందుగా అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్యగారికి అందించిన జి.మాడుగుల మండల బూత్ కన్వీనర్ కొర్ర భానుప్రసాద్, ఈ సందర్బంగా ఇన్చార్జ్ గంగులయ్య మాట్లాడుతూ నియోజకవర్గం వారిగా వివిధ మండలాలకు బూత్ కన్వినర్లని నియమించామని వారంతా గ్రామస్థాయి పర్యటనలు చేస్తూ వేగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు యువతకు, గిరిజన ప్రజలకు చేరువ చేస్తూ విపరీతమైన ఆదరణ లభించేలా వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారని వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని, మండలాల వారిగా మీ కార్యాచరణ ప్రణాళిక వేగవంతం చేయాలని అన్నారు. అలాగే ప్రస్తుతం ఆదివాసీ ప్రాంతంలో గిరిజన స్థితిగతులపై పారదర్శకత, విలువలు, కలిగిన పార్టీగా జనసేన పార్టీని గిరిజన ప్రజలు నమ్ముతున్నారని పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని ఏ పదవులు లేనప్పుడే రాష్ట్రమంతా చూసిందని పాలకపక్షాలు, ప్రతిపక్షాల కుట్రలు తెలుసుకోలేనంత పరిస్థితిలో ప్రస్తుతం గిరిజన ప్రజలు లేరని, నిజానికి రెండు ప్రధాన పార్టీలకు ఆదివాసీ ప్రజలు, పాడేరు నియోజకవర్గం ఇంకోసారి నమ్మేస్తితిలో లేరని ఈ సందర్బంగా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, కార్యనిర్వహన కమిటీ సభ్యులు తాంగుల రమేష్, మండల నాయకులు తల్లే త్రిమూర్తి, ఐటి&సోషల్ మీడియా టీమ్ సభ్యులు అశోక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.