కృష్ణారావు ఐ.పి.ఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

రాయచోటి నియోజకవర్గం: జనసేన నాయకులు, రాయచోటి అసంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ హషన్ భాష మరియు అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు రామ శ్రీనివాస్ లు గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ.బి కృష్ణారావు ఐ.పి.ఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్క అందించి శుభాకాంక్షలు తేలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ వత్తిడులు మరియు ఎటువంటి ప్రలోభాలకు తావులేకుండా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా మీ సేవలు అందించాలని జనసేన తరపున కోరారు. ఎస్పీ బి. కృష్ణారావు ఐ.పిఎస్ సానుకూలంగా స్పందిస్తూ మా సర్వీసులు ప్రజలందరికీ సమానంగా అన్నివేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.