జనసేన, టిడీపి పొత్తు ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దం

  • రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట: రానున్న శాసనసభ ఎన్నికలలో టిడిపితో కలిసి పనిచేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తమకు శిరోధార్యమన్నారు. ప్రజా సౌమ్య పాలన పునరుద్ధరణకు ఇదో పెద్ద శుభపరిణామమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమి గెలుపు సునాయాసమని తెలిపారు. ప్రజా పాలన రావాలి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఏర్పాడాలన్నదే తమ కూటమి లక్ష్యం అని పత్రికా ప్రకటనలో స్పష్టం చేసారు.