సత్తుపల్లిలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

సత్తుపల్లి నియోజకవర్గం: సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి నరేష్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సత్తుపల్లిలో జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు శివాజీ మిరియాల, ప్రధాన కార్యదర్శి కొమ్మగిరి శరత్, సెక్రటరీ రాము యద్దనపూడి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సయ్యద్ జబీర్, సత్తుపల్లి మండల అధ్యక్షులు ఆళ్ల నరేష్, నాయకులు నాగబాబు, విజయభాస్కర్, వేంసూర్ మండల నాయకులు పుల్లెల నవీన్, వెలగా రోహిత్ తదితరులు పాల్గొన్నారు.