టీడీపీ రిలే నిరాహార దీక్షలకు బర్మా ఫణి బాబు మద్దతు

నూజివీడు నియోజకవర్గం: నూజివీడు రూరల్ మండలంలోని మోర్శపూడి, గొల్లపల్లి గ్రామాలలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ తెలుగుదేశం శ్రేణులు చేపట్టిన రిలే నిరసన దీక్షలో నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బర్మా ఫణి బాబు పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం కలిసి కట్టుగా పని చేసి రాబోయే రోజుల్లో అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఇరు పక్షాలు ఉమ్మడిగా పోరాటాలు చేసి రాష్ట్రంలో నూతన పాలనకు కృషి చేయాలని బర్మా ఫణి బాబు పిలుపునిచ్చారు. ఆయనతో పాటు తెలుగుదేశం క్లస్టర్ ఇంచార్జీ యనమదల నాని, మండల అద్యక్షుడు ముసునూరి రాజా, తెలుగు యువత కార్యదర్శి గోగినేని మదు కిరణ్, జనసేన నాయకులు పాశం నాగబాబు, నూజివీడు మండల నాయకులు కరిముల్లా, దుడ్డు పకిరయ్య, గారపాటి ప్రశాంత్, అంకెం రాజేష్, మ శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, జనసేన మండల నాయకులు పాల్గొన్నారు.