వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న వరికూటి నాగరాజు

పొదిలి: పట్టణంలోని బెస్తపాలెం పి.ఎన్.ఆర్ కాలనీలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి దేవుని దగ్గర నాలుగవరోజు కార్యక్రమంలో భాగంగా గురువారం కమిటీ వారి ఆహ్వానం మేరకు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు, రిటైర్డ్ ఏ.పీ.జి.బి చీఫ్ మేనేజర్ కొల్లా హనుమంతరావులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.