పలు జనసేన కార్యక్రమాల్లో పాల్గొన్న జ్యోతులు

పత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన జనసేన వివిధ కార్యక్రమాల్లో జ్యోతుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రత్తిపాడు నియోజకవర్గం నందు జనసేన పార్టీ తగు మద్దతు ఇచ్చే నిమిత్తం జనసేన ఏలేశ్వరంమండలం అధ్యక్షులు పెంటకోట మోహన్ స్వగృహంనందు జనసేన ప్రత్తిపాడు నియోజవర్గ ఇన్చార్జి వరుపుల తమ్మయ్యబాబు అధ్యక్షతన జరిగిన జనసేన ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా పార్టీ అధ్యక్షులు కందులు దుర్గేషు, తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ సమక్షంలో జరిగిన సమావేశంలో జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు పాల్గొన్నారు. అనంతరం పత్తిపాడు నందు జరిగిన చంద్రబాబునాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేషు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల తమ్మయ్యబాబు, తెలుగుదేశం పార్టీ పత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల సత్యప్రభ, పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ జనసేన పార్టీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2-00 గంటలు జనసేన పార్టీ తుని నియోజకవర్గం విస్తృతసాయి సమావేశంనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పాల్గొన్నారు. కందుల దుర్గేషుతో కలిసి పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు పాల్గొన్నారు. సదరు కార్యక్రమం నందు తొండంగి, కోటనందూరు మండలాలు అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు, జిల్లా సహాయ కార్యదర్శులు, జనసేన నాయకులు, జనసైనికులు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.