మేడిపల్లి గ్రామంలో డా. సంపత్ నాయక్ పర్యటన
- ప్రజా సమస్యలపై జనసేన గొంతుక
- సామాన్య ప్రజలకు అండగా ఉంటా
- డా. సంపత్ నాయక్
వైరా నియోజకవర్గం: ఏన్కూరు మండలం, కొత్త మేడిపల్లి గ్రామాలలో శనివారం జనసేన పార్టీ వైరా నియోజకవర్గ ఇంచార్జ్ ఉస్మానియా ఉద్యమకారుడు డా. సంపత్ నాయక్ పర్యటించారు. పర్యటనలో భాగంగా సామాన్య ప్రజల కష్టాలను తెలుసుకొని మీకు తోడుగా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అలాగే రానున్న ఎన్నికలలో ప్రజలు ఉన్నతంగా ఆలోచించి సరైన నిర్ణయాలతో మంచిని ఎన్నుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంపత్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారని సామాన్య ప్రజలు సంక్షేమ ఫలానికి కొండంత దూరంలో ఉన్నారని, మారుమూల ప్రాంతాలలో కనీస రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నానా వ్యవస్థలు పడుతున్నారని, అలాగే ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చిన తరువాత ఇచ్చిన మాటలను నిలబెట్టకుండా ప్రజల సొంత ఇంటి కలను కలగానే మార్చేసిందని విమర్శలను గుప్పించారు. అలాగే వైరా నియోజకవర్గంలోపాలించిన, పాలిస్తున్న వారు కమిషన్లు తీసుకొని వారు బాగుపడడానికే వాళ్లకు ఉపయోగపడిందని ప్రజలకు ఏమాత్రం సంక్షేమ ఫలాలు అందలేదని ఈసారైనా ప్రజలు మేధాశక్తితో ఆలోచించి మంచిని చేయి చేయి కలిపి చేయూతనివ్వాలని జనసేన పార్టీని వైరా నియోజకవర్గంలో గెలిచి పవన్ కళ్యాణ్ కు గిఫ్టుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏన్కూరు మండల కోఆర్డినేటర్ బొగ్గారపు శివకృష్ణ, బుజ్జిగాని సురేష్, జీవన్, దుర్గ అన్నమయ్య, రవి, అనిల్, పవన్, శ్రీకాంత్ కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-23-at-5.58.05-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-23-at-5.58.06-PM-1024x552.jpeg)