గ్రామస్థాయిలో జనసేన బలోపేతమే లక్ష్యం: బొబ్బేపల్లి సురేష్
సర్వేపల్లి: తోటపల్లి గూడూరులో ఆదివారం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వ స్థాపనకు కార్యచరణ సమావేశాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వ స్థాపనకు గ్రామస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఇదే కార్యచరణ పాటిస్తాం. జనసేన పార్టీ తలుపులు తెరిచే ఉంటాయి, పార్టీలోకి వచ్చే నేతలకు ఆహ్వానం ఎప్పుడు ఉంటుంది, జనసేన పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేయండి. అవినీతి, అరాచక, రాక్షస ప్రభుత్వానికి ప్రజలు చర్మగీతం పాడి ప్రజా ప్రభుత్వానికి మద్దతు పలకండి. టీడీపీతో కలిసి ప్రజా ప్రభుత్వ స్థాపనకు జనసేన పార్టీ కృషి చేస్తుంది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ యువత జిల్లా అధ్యక్షులు హరి రెడ్డి, తోటపల్లి గూడూరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు అంకెం సందీప్, చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షులు ఖాజా రహమతుల్లా, పవన్ కళ్యాణ్ యువత నియోజకవర్గ అధ్యక్షులు అశోక్, సీనియర్ నాయకులు రవికుమార్, శరత్, ఆర్ఎంపి విజయ్, షేక్ రహీం, శ్రీహరి, వంశీ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-24-at-4.37.39-PM-1-1024x461.jpeg)