ఘనంగా బెల్లంకొండ సాయిబాబు పుట్టిన రోజు వేడుకలు

గిద్దలూరు నియోజకవర్గం: కంభం స్టేట్ బ్యాంక్ ఎదురుగా జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కంభం మండల అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ బెల్లంకొండ సాయిబాబు నాయకత్వంలో గిద్దలూరులో నాయకులు అందరు శ్రమించి జనసేన జెండా ఎగురవేయడం జరుగుతుందని తెలిపారు. నాయకులు అందరు పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణ, జిల్లా ఆర్గనైజేషన్ కమిటీ కార్యదర్శి ఉదయగిరి మల్లికార్జున, కంభం మండల అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్, రాచర్ల మండల అధ్యక్షుడు పుట్ట బాలకృష్ణ, బెస్తవారపేట మండల నాయకులు ముంతల మధు సుధన్ రెడ్డి, దేవరాజ్, కంభం మండల నాయకులు కోళ్ల రమణ, సురే ప్రసాద్, చింటు, తుమ్మలపల్లి లోకేష్, షేక్ అజ్జు, దూదేకుల కాశింవలి, బెల్లంకొండ సాయన్న, సూరే శ్రీనివాసులు, గాజుల సురేష్, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.