చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో కొణిదె దుర్గాప్రసాద్

గుంటూరు నగరంలోని రాష్ట్ర రజక ధోబిఘాట్ పరిరక్షణ కార్యాలయం నందు చిట్యాల ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర రజక ధోబి కాట్ పరిరక్షణ అధ్యక్షులు చెన్నూరి చెన్నయ్ గారు గుంటూరు 12వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదె.దుర్గ ప్రసాద్ పాల్గొని వారు మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డ పై భూమికోసం భూక్తి కోసం విముక్తి కోసం ఒక మహిళగా చిట్యాల ఐలమ్మ గారు చేసిన పోరాటం నేటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆమె చేసిన పోరాట తీరు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి వెంకటరమణ, మర్రిపూడి రమాదేవి నాగలక్ష్మి, చాటరాజుపల్లి రామారావు మునగాల శ్రీను, రజక నాయకులు, మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.