గవర శ్రీరాములును పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: బొండాయికోడు తూము దగ్గర పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్లో గాయపడిన కాట్రేనికోన మండలం చెయ్యరు జల్లగుంట గ్రామానికి చెందిన గవర శ్రీరాములు (రాంబాబు) కిమ్స్ హాస్పిటల్ ఐ సి యు లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ బుధవారం కిమ్స్ హాస్పిటల్ నందు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరివెంట సానబోయిన మల్లికార్జునరావు, చింతలపూడి పల్లంరాజు ఉన్నారు.