వారాహి యాత్రను విజయవంతం చేయండి: గాదె

గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న 4వ విడత వారాహి యాత్రను విజయవంతం చేయాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోరారు.. పొన్నూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శుక్రవారం గాదె మాట్లాడుతూ.. వారాహి యాత్ర రాజకీయ పార్టీ యాత్ర కాదని రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజలను చైతన్యపరచడానికి చేపట్టిన యాత్ర. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న జగన్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించి పెడదారి పట్టిన యువతను మంచి మార్గంలో నడిపించడానికి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికే వారాహి యాత్ర. చంద్రబాబు అరెస్టు అక్రమం సరైన విచారణ జరపకుండా వ్యక్తిగత కక్షలతో అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో ప్రజల హక్కులను హరిస్తున్నారు. అక్టోబర్ 1 అవనిగడ్డ నుండి ప్రారంభం కానున్న వారాహి యాత్ర సభకు పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా టిడిపి శ్రేణులు మద్దతుగా తరాలి రావాలిని గాదె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, మేకల రామయ్య యాదవ్, అప్పారావు, నగర అధ్యక్షులు కరిముల్లా, మండల అధ్యక్షులు సుబ్బారావు, శ్రీరాములు, వసంతి, యన్నం నాయుడు, వై జె గోపి తదితరులు పాల్గొన్నారు.