జనసేనాని స్పూర్తితో జగదీష్ గాజుల
- రూపాయలు 2.8 లక్షలతో రోటరీ బోర్
రేపల్లె, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలలోకి తీసుకెళ్ళేందుకు ప్రజలకు నడగా నిలిచేందుకు యూకేకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు జగదీష్ గాజుల బాపట్ల జిల్లా, రేపల్లె నియోజకవర్గంలోని శ్రీరామపురం, అప్పాపురం, గురునాధపాలెం మరియు దాసులపాలెం గ్రామ ప్రజలకు మంచి నీటి సమస్య తీర్చాలన్న సదుద్దేశంతో రూపాయలు 2.8 లక్షలు రూపాయలు వెచ్చించి రోటరీ బోర్ వేయించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-29-at-15.18.20-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-29-at-15.18.20.jpeg)
- దాహార్తిని తీర్చే బోరింగ్ పంప్
బాపట్ల జిల్లా, రేపల్లె నియోజకవర్గం, నిజాంపట్నం మండలం లోని ప్రజ్ఞం గ్రామం సముద్ర తీర ప్రాంతం కావటం వలన గ్రామ ప్రజలు ఊరిలో ఎక్కడ బోర్ వేసినా ఉప్పు నీరు వస్తుందని, ఆ సమస్య తీత్చేందుకు యూకేకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు జగదీష్ గాజుల భూగర్భ శస్త్రవేత్తను సంప్రదించి భూ పరీక్ష చేయించడంతో పాటు ఊరి ముఖ ద్వారంలో మంచి నీరు పడుతోందని తెలుసుకొని బోరింగ్ పంప్ వేయించారు. అలాగే, పొలం పనులు కి వచ్చిన వ్యవసాయ కూలీలు దాహం తీర్చటానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-29-at-16.06.40-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-29-at-16.06.40-1-1024x768.jpeg)