గణేష్ చవితి ఉత్సవాలలో పాల్గొన్న జనసేన నాయకులు

  • రామచంద్రాపురం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి ఉత్సవాలు

గుంటూరు: 20వ డివిజన్ లోని రామచంద్రాపురం యూత్ కాలనీ వారి ఆధ్వర్యంలో ఘనంగా గణపతి మహోత్సవములు గత పది రోజులుగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 20వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొలసాని బాలక్రిష్ణ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, గుంటూరు పట్టణ కార్యదర్శి పులిగడ్డ గోపి శ్రీవినాయకుని సందర్శించి పూజ కార్యక్రమాలు నిర్వహించినారు. స్వామి వారిని అత్యంత సుందరీకరణంగా అలంకరించినారు. ఉదయం స్వామి వారి ముందు హోమాలు నిర్వహించినారు. ఈహోమంలో మహిళలు, వృద్దులు, పురుషులు పాల్గొన్నారు. అనంతరం భారీ అన్నదానం కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, పెద్దలు, యూత్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.