విఘ్నేశ్వర స్వామి అన్నసమారాధనలో పాల్గొన్న జ్యోతుల

పిఠాపురం నియోజవర్గం: గొల్లప్రోలు నగర పంచాయతీ నందలి కర్ణం గారి తోటలో సిద్ధ కొండలరావు{చిట్టిబాబు} సెంటర్ వద్ద గల విగ్నేశ్వర స్వామి ఆలయము నందు ఏర్పాటు చేసిన వినాయకుని నవరాత్రుల మండపం కమిటి వారు వినాయక నవరాత్రుల సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినాయక నవరాత్రుల కమిటీ వారు, జనసేన నాయకుల ఆహ్వానం మేరకు జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని విఘ్నేశ్వరుడిని దర్శించుకొని అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నసంతర్పణకు 2000/- చందాగా సమకూర్చారు. ఈ కార్యక్రమం బసా గోవింద్, కామిరెడ్డి విష్ణు, మామిడాల సూరిబాబు, తలారి శ్రీనివాస్, కీర్తి చంటి, జ్యోతుల సీతారాంబాబు, మేడిబోయిన హరికృష్ణ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.