యు.పి.రాజు ఆధ్వర్యంలో గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

రాజాం నియోజకవర్గం: జనసేన పార్టీ రాజాం నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు స్వాతంత్ర్యం మన హక్కు అనీ క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం వంటి ఎన్నో ఉద్యమాలు చేసి ముఖ్యంగా సత్యం అహింస అనే మాటలను ఆయుధాలుగా చేసుకొని బ్రిటిష్ వారి నుండి విముక్తి కల్పించిన మన జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా మరియు జై జవాన్ – జై కిసాన్ అనే నినాదంతో స్వతంత్రపు బాటలు వేసిన శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు మాట్లాడుతూ గాంధీజీ అనుసరించిన మరియు ఆచరించి చూపిన సత్యం అహింస మార్గాలను యువత ఆచరించాలని మరియు జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడగానే రైతులను దేశానికి ఆదర్శంగా నీలేచెల చర్యలు తీసుకుంటుంది అని లాల్ బహుదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ మరొక్క సారి గుర్తు చేస్తూ మాట్లాడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గొర్లె గోవిందరావు, ఎన్ని సత్యనారాయణ, సామంతుల రమేష్, హరిబాబు, రాంబాబు, ఈశ్వర్, దాలినాయుడు, రాజారావు, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.