సత్యమేవ జయతే నిరసన దీక్షకు గంగారపు రాందాస్ మద్దతు

మదనపల్లి: నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కి మరియు మహాత్మా గాంధీ జయంతి రోజున ఈ పుణ్య దినాన రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు గారిని ఒక సైకో ఒక అవినీతి పరుడు 40 సంవత్సరాల సుధీర్ఘ రాజకీయ చరిత్రలో ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఉన్న చంద్రబాబు నాయుడుని జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలులో చిప్ప కూడు తినినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని 16 రోజులు అయినా జైల్లో ఉంచాలని అధికార మధంతో ఆయన చేసిన పనిని నిరసిస్తూ సోమవారం నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మని, నిరాహార దీక్షలకి మద్దతుగా మదనపల్లి నీరుగట్టువారిపల్లిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్, చినబాబు ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్షలో మైనారిటీ నాయకుడు ఎస్.ఎ మస్తాన్, మహబూబఖాన్, బీసీ నాయకలు నాగేంద్ర, రవి, బండి అమర, తెలుగు యువత అరుణ్, ప్రణయ్, రమేష్ లకు మద్దతుగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, రెడ్డెమ్మ, మోహన్ కృష్ణ, అర్జున, చంద్రశేఖర, జంగాల గౌతమ్, జయ, శంకర, జనార్దన్, విజయ్ కుమార్, గంగులప్ప టీడీపీ, జనసేన కార్యకర్తలు, వీరహిళలు తదితరులు పాల్గొన్నారు.