గిరిజన క్షేమం కోసం ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాడాలి

పాడేరు: జనసేన పార్టీ నాయకులు గ్రామస్థాయి క్షేత్ర పర్యటనలో బాగంగా మండలంలో గలా పిల్లిపుట్టు, వంచెడగొంది, చీడిమెట్టు, వొనబొంగి, తోటలగొంది గ్రామాలను సందర్శించిన జనసేన పార్టీ నాయకులు లీగల్ అడ్డ్వైజర్ కీల్లో రాజన్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ స్థాయిలో గిరిజన ప్రజల ఆదరణ మాకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది ప్రతి పల్లెలో జనసైనికులున్నారని గ్రామాల్లో సైతం ప్రస్తుత రాజకీయాలపై చైతన్యం వచ్చిందని అన్నారు. గిరిజన ప్రజల హక్కులు, చట్టాలు పరిరక్షించాలని అందుకు మనమంతా గిరిజన ప్రజాక్షేమం కోసం కలిసి కట్టుగా ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాడాలని అన్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ కచ్చితంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటామని అధికారంలో లేకున్నా కూడా ప్రజాక్షేమం కోసం పరితపించే గుణమున్న వ్యక్తిగా పరిపాలన చేయగల సమర్థత అతనికుందని అన్నారు. ఈ గ్రామ పర్యటనలో పాడేరు జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ తదితర జనసైనికులు పాల్గొన్నారు.