టీడీపీ నిరసన దీక్షలో పాల్గొన్న జనసేన నాయకులు

రంపచోడవరం నియోజకవర్గం: గత 20 రోజులుగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై కొనసాగుతున్న దీక్షలో జనసేన నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి, పి ఆర్ పి శ్రీను, కొణతం శ్రీనివాస్ పాల్గొన్నారు. జనసేన ముఖ్య అధ్యక్షులు కుర్ల రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి అక్రమ అరెస్టులు సరికాదని రాష్ట్రానికి ఎంత దుష్ట పరిపాలన జరుగుతుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అప్పుచేసి పప్పు కూడులా మారిందని, ఇంకా ఈ ఆరు నెలలు మాత్రమే దుష్టపాలన సాగుతుందని మన ప్రభుత్వం వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.