మంథని నియోజకవర్గంలో జనసేన పోటీకి సిద్ధం

తెలంగాణ, మంథని నియోజకవర్గం: రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్నందున మంథనిలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తునందున్న మీడియా ప్రతినిధులతో మంథని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మాయ రమేష్ మంథని ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాయ రమేష్ మాట్లాడుతూ తెలంగాణాలో 32 స్థానాల్లో పోటీ ఉంటుంది అని.. అలాగే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర కూడా మంథనిలో ఉంటుందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మంథని మండలం అధ్యక్షుడు ఈరవేన ఓంప్రకాష్, కాటారం మండల అధ్యక్షులు జనాగం పవన్, మంథని మండల వైస్ ప్రెసిడెంట్ మెరుగు సునీల్, మేకల శ్రవణ్, కాసు రంజిత్ అనుమాల వినయ్, మనోజ్, దొగ్గేలా సాయికిరణ్, అభిషేక్, అరిగల వెంకటేష్, శశి, సర్వేశ్ తదితరులు పాల్గొన్నారు.