సరికొప్పుల అధ్వర్యంలో జనసేన భారీ ర్యాలీ
తెలంగాణ, హుజూర్నగర్ నియోజకవర్గం: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో హుజూర్నగర్ జనసేన పార్టీ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం సుమారు మూడు వందల మందితో.. డప్పు కోలాటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తదనంతరం ఆత్మీయ సమావేశంతో పాటు కిట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణలో పోటీ చేస్తున్న 32 నియోజవర్గాలలో హుజూర్నగర్ నియోజకవర్గం కూడా బలమైన నియోజవర్గం అని పత్రికా సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు అందరూ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-05-at-9.07.09-PM-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-05-at-9.07.09-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-05-at-9.07.10-PM-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-05-at-9.07.08-PM-2-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-05-at-9.07.08-PM-3-1024x683.jpeg)