శాంతియుత ర్యాలీ కార్యాచరణ సమావేశం

గుంటూరు: లాడ్జి సెంటర్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 7వ తారీకు నిర్వహించే శాంతియుత ర్యాలీపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా జనసేన నాయకులతో తెదేపా నాయకులు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి శాంతియుత ర్యాలీకి అన్నీ మిత్ర పక్షాలు, ప్రజా సంఘాలు కలసిరావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు లాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని అరెస్ట్ చేయడం హేయయమైన చర్యగా అభివర్ణించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టడానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. అక్టోబర్ 7వ తారీకు జరిగే శాంతియుత ర్యాలీకి జనసేన పార్టీ తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అక్టోబర్ 7వ తారీకు గుంటూరు లాడ్జి కూడలి నుంచి మార్కెట్ కూడలి గాంధీ విగ్రహం వరకు ధర్మాగ్రహ శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నాం. జనసేన, టీడీపీ, సీపీఐ, మిత్రపక్షాలు కలుపుకొని ర్యాలీని జరుపటం జరుగుతుంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్, రాజ్యాంగాన్ని ఖునీ చేసిన వైసీపీ ప్రభుత్వంపై ప్రత్యేక పోరాటం ప్రకటిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, మిత్రపక్షాలు కూడా కలసి పోరాడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు తుంగలో తొక్కి వైసీపీ పైశాచిక ఆనందం పొందుతుంది. రాష్ట్రంలో 28 రోజులుగా టీడీపీ అధినేత జైలులో పెడితే ప్రతిపక్షాలు నిరసనలు చేయకుండా అడ్డుకోవడం చూస్తుంటే ఎక్కడ ఉన్నామో అర్ధం కావడంలేదు. రాష్ట్రంలో30 యాక్ట్ అమలులో ఉందని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు. రేపు జరిగే శాంతియుత ర్యాలీకి సహకరించాలని ప్రతిఒక్కరిని కోరారు.