పలమనేరు జనసేన మండల కమిటీ ఆత్మీయ సమావేశం
పలమనేరు నియోజకవర్గం: పలమనేరులోని ఆర్&బి గెస్ట్ హౌస్ నందు పలమనేరు రూరల్ మండలం జనసేన నాయకులతో మరియు జనసైనికులతో అదేవిధంగా మండల కమిటీతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎలా కలిసి పని చేయాలి మరియు మన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడం, మరియు నూతన కమిటీ కూడా ఏర్పాటు చేయడం కమిటీలో లేకుండా పార్టీ కోసం పని చేస్తున్న నాయకులను ఈ కమిటీలో గుర్తించడం జరిగింది. ఈ కీలకమైన కార్యక్రమంలో రూరల్ మండలం పరిధిలో ఉన్నటువంటి ప్రతి జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-07-at-2.20.44-PM-1-1024x768.jpeg)