పొన్నలూరులో సచివాలయం నిర్మాణం పూర్తి చేయాలి- జనసేన డిమాండ్

  • పొన్నలూరు సచివాలయంలో పశువులకు సేవలు అందించబడును

కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలంలో ఎస్.బి.ఐ బ్యాంకు ఎదురుగా ఉన్నటువంటి సచివాలయాన్ని జనసేన నాయకులు సందర్శించడం జరిగింది, వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పైబడిన ఇంకా పూర్తికాకుండా, అధికారులు మరియు వైసీపీ నాయకుల నిర్లక్ష్యం వల్ల అసంపూర్తిగా ఉంది, వచ్చిన నిధులు దారి మళ్లించి వైసిపి నాయకులు జేబులు నింపుకున్నారు, ఈ సచివాలయంలో పశువులను కట్టివేసి, పశువుల మేతను కూడా ఇక్కడే ఉంచారు. ఇక్కడ ప్రజలకు సేవలు అందించకుండా పశువులకు సేవలు అందిస్తున్నారు. ఇక్కడ దృశ్యాలు చూస్తూ ఉంటే ప్రజలందరికీ హాస్యస్పదంగా ఉంది, పొన్నలూరులో వైసిపి నాయకులు చేస్తున్న అవినీతిలో ఈ సచివాలయం కూడా ఉంది, ఇప్పటికైనా అధికారులు మరియు వైసీపీ నాయకులు మేలుకుని ఈ సచివాలయాన్ని పూర్తిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము అని పొన్నలూరు మండల అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్ణ తిరుమలరెడ్డి, పెయ్యల రవికుమార్ యాదవ్, పిల్లిపోగు పీటర్ బాబు, ఖాదర్ బాషా, మహబూబ్ బాషా, సుంకేశ్వరం శ్రీను, ఆంజనేయులు, లక్ష్మణ్, వెంకట్ రెడ్డి, చైతన్య జనసైనికులు పాల్గొన్నారు.