మునుగోడు బరిలో జనసేన: గోకుల రవీందర్ రెడ్డి

తెలంగాణ, మునుగోడు, రానున్న తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో నిలబడుతుంది అని నియోజకవర్గ ఇంచార్జ్ గోకుల రవీందర్ రెడ్డి చౌటుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గోకుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి కుటుంబ నేపద్యం నుండి వచ్చి విద్యార్థి నాయకుడిగా ప్రయాణం ప్రారంభించి అనేక విద్యార్థి నిరుద్యోగ ఉద్యమాలలో జనసేన పార్టీ తరుపున పోరాడడం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా ఐదు వేల మంది జనసేన క్రియాశీలక సభ్యులు ఉన్నారని, గతంలో విద్యార్థి మరియు రోడ్లపై పాదయాత్రలు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమస్యల పరిష్కారించడం జరిగిందని, సమస్యల కుప్పగా నియోజకవర్గం తయారయ్యిందని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది కచ్చితంగా జనసేన పార్టీ సామాన్య మధ్యతరగతి యువత మరియు కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పర్నే శివారెడ్డి, పులకరం చంద్రకాంత్, మెగావత్ బద్రి రాజు నాయక్, చిదిగుళ్ళ దినేష్, మహేష్, నరేష్, మధు, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.