జనసేనతోనే మత్స్యకార కుటుంబాలకు సంపూర్ణం న్యాయం జరుగుతుంది
పెందుర్తి నియోజకవర్గం: జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు గౌరవనీయులు గొన్న రమాదేవి మత్స్యకార గ్రామాల్లో
సముద్ర తీరాన.. మత్స్యకారులతో వారి యొక్క సమస్యలను అడిగి
వారి సాధక బాధలను పూర్తి అవగాహనతో మత్స్యకారుల పట్ల
వారి సమస్యలు వింటూ వారి సమాధానాలు తీసుకుంటూ జనసేన పార్టీ సిద్ధాంతాలను భావాలను వివరిస్తూ జనసేన పార్టీ అధికారంలోకి రాగానే పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మత్స్యకారుడు కుటుంబానికి సంపూర్ణంగా న్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు మీ పట్ల మంచి స్వేచ్ఛ భావంతో ఉన్నారని మీ సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఆయన సభా వేదికల ద్వారా మరియు పలు సందర్భాల్లో మాట్లాడుతున్నారని అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరియు దేశ నలమూల ప్రజలందరూ కూడా చూస్తున్నారని మత్స్యకారుల సమస్యలు భారతదేశ పటంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టారని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మత్స్యకారులు మాట్లాడుతూ.. మా సమస్యలు ఎవరూ పట్టించుకోవట్లేదు అని మీలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ మా సమస్యలు చేరవేసే విధంగా పోరాడుతున్నారని మా వద్దకు వచ్చి దఫ దఫస్లుగా మా సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ గొన్న రమాదేవిని అభినందించారు. ప్రజా సంక్షేమమే జనసేన ధ్యేయమని గొన్న రమాదేవి మత్స్యకారులతో కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొవిరి నర్సింగరావు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-10-at-3.44.09-PM-1024x768.jpeg)