హుజూర్ నగర్ నియోజకవర్గ వర్కింగ్ కమిటీ నియామకం

తెలంగాణ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శంకర్ గౌడ్ మరియు రాష్ట్ర ముఖ్య నాయకులు రాధారం రాజలింగం ఆదేశాల మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గ వర్కింగ్ కమిటీ మెంబెర్లుగా గజనబోయిన సైదులు యాదవ్, షేక్ హసన్ మియా, అందే శ్రీను, కొమర్రాజు శ్రీనులను నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి సరికొప్పుల నాగేశ్వర్ నియమించడం జరిగింది. ఈ సందర్భంగా సైదులు యాదవ్ షేక్ హసన్ మియా లు మాట్లాడుతు మా మీద నమ్మకంతో మాకు ఈ బాధ్యతలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శంకర్ గౌడ్, రాష్ట్ర ముఖ్య నాయకులు రాజలింగం మరియు ఇంఛార్జి నాగేశ్వర్ లకు కృతఙ్ఞతలు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.