జనసేన మరియు టిడిపి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం కృష్ణంపాలెం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ జనసేన పార్టీ మరియు టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో టిడిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ముళ్ళపూడి బాపిరాజు, చినబాబు, ఉండవల్లి ప్రసాద్, గోపాలపురం నియోజకవర్గ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు మాట్లాడుతూ అధికార పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని కక్షపూరితంగా ప్రతిపక్ష పార్టీలను నాయకుల, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ పాలన సాగిస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీని గద్దె దింపి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాలని ప్రజలకు టిడిపి శ్రేణులకు, జనసేన నాయకులకు, వీర మహిళలకు కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కృష్ణంపాలెం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ నాయుడు ప్రసాద్, యాదవులు గ్రామ అధ్యక్షుడు అనిశెట్టి శ్రీనివాస్, అనిశెట్టి మధు, వీర మహిళలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో సంఘీభావంగా పాల్గొన్నారు.