తోట రామాంజనేయులును పరామర్శించిన పెంటేల బాలాజీ

చిలకలూరిపేట, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి పురుషోత్తంపట్నం వాస్తవ్యులు తోట రామాంజనేయులు తండ్రి తోట కోటేశ్వరరావు పరమపదించారు. నియోజకవర్గం జనసేన నాయకులు పెంటేల బాలాజీ వారిని పరామర్శించి వారికి మరియు వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి ఎల్.బి నాయుడు, యడ్లపాడు మండల ఉపాధ్యక్షలు మేకల రామారావు, మల్లా కోటి, కార్యదర్శి పాపన హనుమంతరావు, నాదెండ్ల మండల నాయకులు జి.డి నాయుడు, పట్టణ నాయకులు అచ్చుకోల అరుణ్, బైరా భాను, ముద్దా యోబు, అమరేశ్వరి, పగడాల పాల్గొన్నారు.