సల్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకి కూరగాయల పంపిణి

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి మండలం చిత్తూరు బస్టాండ్, వాల్మీకి సర్కిల్ లో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి గారి శిష్యుడు సల్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకి ఉచితంగా కూరగాయల పంపిణి చేసారు. ఈ సందర్భంగా రాందాస్ చౌదరి మాట్లాడుతూ తమ్ముడు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత కారణాల రీత్యా విదేశాల్లో ఉంటున్నాడు. ప్రతి సంవత్సరం తన సంపాదనలో కొంత భాగం పేద ప్రజలకి ఇవ్వడం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఆయన బాటలో నడవడం చాలా సంతోషదాయకం అని అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తు అతని కుటుంబానికి అల్లా వెంకటేశ్వర స్వామి, జీసస్ ఆశీస్సులు ఎల్ల వేలలా ఉండాలని అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీల కలియకతో సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ, కుమార్, లవన్న, జనార్దన్, నవాజ్, పవన్, నారాయణ స్వామి, ఆదినారాయణ, నవీన్, బాలాజీ, చైతు, అనిల్, రంజిత్, రామాపురం పవన్, అఖిల్, సత్య, జేశ్వంత్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.