ప్రభుత్వ కార్యక్రమంలో పవన్ పెళ్లిళ్ల గురించి అవసరమా?

పల్లె నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానముగా నగరం మండలం జనసేన పార్టీ ఆఫీస్ లో శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఉదయ్ కృష్ణ మాట్లాడుతూ ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల గురించి మాట్లాడటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. సామర్లకోటలో 100 ఇల్లు నిర్మించి దానికి ప్రజా ధనం 50 కోట్లు వెచ్చించి హామీ ఇచ్చిన విధంగా 28 లక్షల ఇళ్లు పూర్తి చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు అని విమర్శించారు. రాబోయే 5 నెలలలో వైసీపీ ప్రభుత్వం మారిపోయి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉదయ్ కృష్ణతో పాటు నగరం గ్రామ అధ్యక్షులు అందే సాంబయ్య, మండల కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు, మర్రిపూడి డైసన్, సురేష్ పాల్గొన్నారు.