నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలసిన సీ.జి రాజశేఖర్

పత్తికొండ నియోజకవర్గం: జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను పత్తికొండ నియోజకవర్గ నాయకులు సీ జి రాజశేఖర్ కలిసి పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు గురించి మాట్లాడడం జరిగింది. లోకల్ గా మేము ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. పత్తికొండ నియోజకవర్గంలో పార్టీ బలపేతం చేయడం గురించి గ్రామస్థాయి నుండి పార్టీ జనసేన పార్టీ బలపరిచే విధంగా కార్యచరణ గురించి చర్చించడం జరిగింది. మనోహర్ గారు మాకు జనసేన పార్టీ ఎలా బలపేతం చేయాలి అనే విషయంపై దిశా నిర్దేశం చేశారు. 2024కు సంబంధించి, మీరు ఇంకా బలంగా పార్టీ కోసం కష్టపడండి, పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ జనసేన వారికి వస్తుందా లేక టిడిపి పార్టీకి అనేది మేము, టిడిపి నాయకులు మేము అంతా కూర్చుని డిసైడ్ చేస్తాం, మీరు ఎలాంటి అపోహలు పోవద్దు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి, మీరు ఎక్కడా ఎవరికి భయపడకుండా పార్టీని బలపేతం చేయండి అందరికీ మేము అండగా ఉంటాం అధ్యక్షులు వారు అండగా ఉంటారు అని తెలియజేశారు. నాదెండ్ల మనోహర్ గారిని కలిసిన వారిలో ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, జడ్పిటిసిగా, పోటీ చేసిన అభ్యర్థులు నాయకల్ బాబ్జి, పులి శేఖర్, మద్దిలేటి, గద్దల రాజు, గల్లా రామచంద్ర, నరేష్, వడ్డే విరేష్, ఎర్రిస్వామి, నాగేశ్వరరావు, మనోహర్ ను కలవడం జరిగింది.