పరిపాలన చేతకాక వ్యక్తిగత దుషణాలు చెయ్యడం సిగ్గు చేటు: చల్లా వరుణ్

ఎమ్మిగనూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై సామర్లకోట
బహిరింగ సభలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను ఎమ్మిగనూరు జనసేన నాయకులు చల్లా వరుణ్ తీవ్రంగా ఖండించారు. శనివారం ఎమ్మిగనూరులో జనసేన ఆధ్వర్యంలో జగన్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా చల్లా వరుణ్ మాట్లాడుతూ. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్ది పరిపాలన చేతకాక వ్యక్తిగత దుషణాలు చెయ్యడం సిగ్గు చేటు. ఎన్నికలు హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, జాబు క్యాలెండర్ వీటికి గురించి మాట్లాడే ధైర్యం లేక పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్లు గురించి బహిరంగ సభలో మాట్లాడం ఎంత వరకు సమంజసం. దేశంలో ఇటువంటి చెత్త, సైకో సీఎం ఎక్కడ చూసినా ఉండరు. పరిపాలన చేత కాదు. ఇక నుంచైనా సంస్కారం నేర్చుకో జగన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మిగనూరు జనసేన నాయకులు చల్లా వరుణ్ హెచ్చరించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.