ఇంటింటికీ జనసేన నిర్వహించనున్న పితాని

  • ఇంటింటికీ జనసేన పవన్ రావాలి, పాలన మారాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న పితాని..

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గం నాలుగు మండలాల కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ సోమవారం నుండి నియోజకవర్గంలో ఇంటింటికీ జనసేన కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలియచేసారు. అక్టోబర్ 16న
భట్నవిల్లి శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రేత్యేక పూజలు నిర్వహించి, నూతన జనసేన ప్రచార రదానికి పూజలు చేసి మాతల్లి గారి అచర్వచనం తీసుకొని ఈ కార్యక్రమం ప్రారంభించనున్నామని పితాని అన్నారు. తమ ప్రియతమ నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. వైకాపా దుష్ట పాలనను అంత చేసేందుకు పార్టీల కలయిక ఆవశ్యకతను ఆయన వివరించారు. ఇంటింటికీ జనసేన పవన్ రావాలి, పాలన మారాలి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి రావలిసిందిగా పితాని కోరారు.. సోమవారం నుండి నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ వెళ్లి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరం గురించి తెలియ చేయనున్నామని అన్నారు. ఈ కార్యాలయంలో నాలుగు మండలాల నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.