పిటిషన్లపై ప్రశ్నల వర్షం: హైకోర్టు

రాజదాని అంశంఫై ఇటీవల దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం గురువారం విచారణ జరిపి కొన్నికీలక ప్రశ్నలను సందించింది. రాజధానికి సంబంధించి ఇప్పటి వరకూ రూ.52వేల కోట్ల వ్యయం చేశారని సీఆర్డీఏ రికార్డును పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు వివరించగా. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు.. నిర్మాణం ఎక్కడ ఆగింది వంటి వివరాలు కావాలని ఆదేశించింది. ఇది ప్రజల సొమ్ము.. రాష్ట్ర ఖజానాకు నష్టమే కదా.. అని వ్యాఖ్యానించింది.

అలాగే బిల్డింగ్‌లు ఎన్ని పూర్తయ్యాయి.. ఎక్కడ ఆగిపోయాయి.. ఎంత వ్యవయం చేశారు.. కాంట్రాక్టర్లకు ఎంత డబ్బులివ్వాలి.. వంటి వివరాలన్నీ వెంటనే సమర్పించాలని ఆదేశించింది. నిర్మించిన భవనాలను వాడుకోకపోతే, అవి పాడైపోతాయి కదా.. ఆ నష్టం ఎవరు భరిస్తారని ప్రశ్నించింది. రాష్ట్ర అకౌంటెడ్ జనరల్‌కు వెంటనే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ డబ్బులు ఎక్కడ నుంచి తీసుకువచ్చారు.. రూ.52 వేల కోట్లు ప్రాజెక్ట్‌లు ఏ దశలో ఉన్నాయో కూడా వివరాలు ఇవ్వాలంది. ఈ కేసు విచారణను ఈ నెల 14కు హైకోర్టు వాయిదా వేసింది.