కుప్పం మండల జనసేన కార్యవర్గ సమావేశం

కుప్పం: జిల్లా అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలోని మండల కార్యవర్గ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆదివారం శాంతిపురం మండల అధ్యక్షులు కిషోర్ ఆధ్వర్యంలో మండల కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించడం, అందులో ముఖ్యంగా పంచాయతీ మరియూ బూత్ కమిటీల ఎంపిక ప్రక్రియ త్వరలో జిల్లా అధ్యక్షుల వారి నియోజకవర్గ పర్యటన సమక్షంలో తెలుగుదేశం పార్టీతో ఆత్మీయ కలయిక సమావేశంపై జనసేన పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై నాయకులు చర్చించటం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి రామమూర్తి రాష్ట్ర మత్స్యకార శాఖ కార్యదర్శి వామనుమూర్తి, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మధు, శాంతిపురం మండల ఐటీ కోఆర్డినేటర్ కెవి ప్రసాద్, నియోజకవర్గ సీనియర్ నాయకులు రమేష్ గారు, మండల కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్, రవితేజ రవీంద్ర హరికుమార్, హరిక్రిష్ణ, కిరణ్, ధనుష్, అప్పి, ఆనంద్, బాబు, సుబ్బు, కె యస్ బాబు, నవీన్, సురేష్ రామకుప్పం మండల అధ్యక్షులు హరీష్ మరియు జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.