జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

తిరుపతి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా, పాకాల మండలం, దామలచెరువు గ్రామం, మంగినాయన పల్లెలో ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో గ్రామంలోని జనసేన సభ్యత్వ కిట్లు అందజేయడం జరిగింది. ఇలా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందజేశామని ప్రతి ఒక్కరు మాకు 2024లో జనసేన ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. మరియు తిరుపతి ఏడుకొండల స్వామి దగ్గర తిరుపతి అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఈసారి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు ఎమ్మెల్యేగా గెలవాలని దామలచెరువు ప్రజలందరూ కోరుకుంటున్నారని జనసేన పార్టీ మరియు కాపు సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మారసాని రసాని రమేష్ బాబు ఈ సమావేశానికి హాజరైన అందరికీ ధన్యవాదములు తెలియజేశారు.