జగన్ రెడ్డి హుందాగా మాట్లాడిఉంటే ప్రజలు హర్షించేవారు: అంగ సురేష్
ఎచ్చెర్ల: జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండికూడా నాలుగేళ్ళుగా ప్రతీ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంతప్ప, రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించిగానీ, రాష్ట్ర అభివృద్ధి గురించిగానీ మాట్లాడకపోవడం ఆయన అనైతికతకు, ఎన్నికల్లో ఓటమిపాలవుతాననే భయానికి నిదర్శనమని గురువారం జరిగిన పెద్దాపురం, సామర్లకోట సభల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుందాగా మాట్లాడిఉంటే ప్రజలు హర్షించేవారని జనసేన పార్టీ కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి తరిమేయడానికి ఎన్నికలు తొందరగా వస్తే బాగుండునని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తూన్నారని అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-15-at-8.11.06-PM-1-1024x678.jpeg)