ఆహా లో ప్రసారం కానున్న ‘మెట్రో క‌థ‌లు’

తెలుగు ప్రేక్షకులకు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న ఆహా ఇప్పుడు మ‌రో ఎగ్జ‌యిటింగ్ ఒరిజిన‌ల్ ‘మెట్రో క‌థ‌లు’తో సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. ‘ప‌లాస 1978’ చిత్రంతో ఘ‌న విజ‌యం సాధించిన డైరెక్ట‌ర్ క‌రుణ కుమార్ ‘మెట్రో క‌థ‌లు’ను తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు రచయిత కదిర్ బాబు రచించిన ‘మెట్రో కథలు’ పుస్తకంలోని నాలుగు కథలను ఆధారంగా చేసుకుని హైద‌రాబాద్ న‌గ‌రంలో నాలుగు జంట‌ల మ‌ధ్య ఉండే అనుబంధాలు, భావోద్వేగాల స‌మాహారంగా ఈ ‘మెట్రో క‌థ‌లు’ ఒరిజినల్ రూపొందింది. స్వాతంత్ర్య దినోత్స‌వ సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 14న ఈ ఒరిజిన‌ల్ ‘ఆహా’లో ప్రసారం కానుంది. ఈ అంథాల‌జీ ఫ‌స్ట్ గ్లింప్స్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ విడుద‌ల చేశారు.