ద్వారకాతిరుమల జనసేన మండల కమిటీ సమావేశం

గోపాలపురం: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో చిన్నయగుడెం కొవ్వొత్తుల ర్యాలీ అనంతరం సువర్ణరాజు ద్వారకాతిరుమల మండలం, తిమ్మాపురంలో ఆదివారం గ్రామ జనసైనికులతో సమావేశం అయ్యారు. ఇందులో భాగంగా గోపాలపురం నియోజకవర్గ ఇంచార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు, పవన్ కళ్యాణ్ ఆశయాలు పార్టీ సిద్ధాంతాల గురించి మరియు పవన్ కళ్యాణ్ చేసిన సేవలు, పార్టీని నడుపుతున్న విధానం గురించి చెప్పారు. తిమ్మాపురం గ్రామంలో త్వరగా ఒక కమిటీ ఏర్పాటు చేసి తదుపరి సమావేశాలు, గ్రామంలో ప్రజలకు మన పార్టీ విదానన్ని గురించి ఎం చేస్తే పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎలా కష్టపడాలి అనే అంశాలు మాట్లాడారు. తిమ్మాపురం పార్టీ కమిటీ త్వరలోనే నిర్మిస్తామని గ్రామ జనసైనికులు మాట ఇచ్చారు. సమావేశంలో జనసైనికులు నరసింహ, ఎస్ కె రెహమాన్, ఓరుగంటి దుర్గాచందు, ఎస్ కె షాజహాన్, బొమ్మగాని శరత్ కుమార్, పిట్టా వెంకటేశ్వరరావు, ఆకుర్తి గణేష్, మైలవరపు వాసు, గణేష్, ములకాల అనిల్ కుమార్ మరియు సుమారు 35 మంది జనసైనికులు పాల్గొన్నారు. త్వరలోనే గ్రామ విసృత సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.