ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు జగన్ రెడ్డి??

  • ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు చల్లా శ్రీ వరుణ్

ఎమ్మిగనూరు నియోజకవర్గం: జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పాదయాత్రకు వచ్చిన రోజున.. నియోజకవర్గానికి మీరు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఎందుకు నెరవేర్చలేదని ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు చల్లా శ్రీ వరుణ్ ప్రశ్నించారు. బుధవారం శ్రీ వరుణ్ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యంగా .. చేనేత సమస్యలు చేనేతల ఆత్మహత్యలు నివారిస్తానని చేనేతులకు అండగా ఉంటానని ఆ రోజు మీరు హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దశాబ్దాలుగా శిలాఫలకాలికే పరిమితమైన టెక్స్టైల్ పార్క్ ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.. అది ఇప్పుడు వరకు ఇంకా నెరవేర్చలేదు. రాయలసీమలో కర్నూలు జిల్లాని న్యాయ రాజధాని చేస్తానన్నారు ఎక్కడ?. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఏమి అభివృద్ధి చేశారని ఈరోజు మీరు ఇక్కడికి వస్తున్నారు? జగనన్న ఇండ్ల పేరుతో.. ఎంతమంది లబ్ధిదారులకు మీరు ఇల్లు ఇచ్చారు. స్మార్ట్ సిటీ పేరుతో బానవాసి దగ్గర సుమారుగా 100 ఎకరాలు చెట్లు కొట్టేసి వైఎస్ఆర్సిపి నాయకులు అవినీతికి పాల్పడ్డారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీతో సహా.. మీ నాయకుడు అందరూ కూడా.. పరిపాలన గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. వీటన్నిటిమీద.. ఎమ్మిగనూరు జనసేన పార్టీ తరఫున మీకు వినిత పత్రం ఇవ్వాలని అనుకుంటున్నామని శ్రీ వరుణ్ తెలిపారు.