101 మంది భవాని మాలధారణ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, ఎండపల్లి గ్రామం నందు దుర్గాదేవి అమ్మవారి గుడి వద్ద గుడి స్వామి మరశక్తి నాశక్తి ఆధ్వర్యంలో 101 మంది భవాని మాలధారణ కార్యక్రమంలో భాగంగా గుడి స్వామి మరియు కూడా కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మచ్చ శ్రీనివాసరావు, ఎక్స్ సర్పంచ్ గరగా సత్యనాదరావు, దుడ్డు నాగు, బొజ్జ గోపి కృష్ణ, దుడ్డు రాంబాబు, బండి ఏసుబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.