జనసేనతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు!: బత్తుల

  • ఆంధ్ర రాష్ట్ర భవితపై జనసేన ప్రజా సంతకం ఖచ్చితంగా ఉండబోతుంది
  • ప్రతి పేదవాడు స్వేచ్ఛగా, గొప్పగా బ్రతకాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆశయం!
  • బడుగు బలహీన వర్గాల పేదరిక నిర్మూలన జనసేన పార్టీ లక్ష్యం!
  • కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామంలో’ జనం కోసం జనసేన”మహాపాదయాత్ర’కు అడుగడుగున జననీరాజనం!
  • సమాజ శ్రేయస్సు కోసం పుట్టిన జనసేన పార్టీ విజయానికి మనమందరం శక్తి వంచన లేకుండా కృషి చేద్దాం
  • రాష్ట్రం మనది భవిత మనది.. రాష్ట్ర అభివృద్ధికి జనసేన పార్టీ తరపున మన వంతు కృషిని నిబద్ధతతో చేద్దాం
  • ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి ప్రజా పరిపాలన తీసుకురావాలని కోరిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: బూరుగుపూడి గ్రామంలో గురువారం నిర్వహించిన ‘జనం కోసం జనసేన’ ‘మహా పాదయాత్ర’ను నిర్వహించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారికి గ్రామ ప్రజానీకం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏకపక్షంగా మద్దతు తెలియజేసి, రానున్న ఎన్నికల్లో పూర్తిగా జనసేన పార్టీ పక్షాన నిలబడి.. బత్తుల బలరామకృష్ణ నాయకత్వాన్ని బలపరిచి.. పవన్ కళ్యాణ్ గారి ప్రజా పరిపాలన కోసం ఎదురుచూస్తున్నామని వారే చెప్పడం చూస్తుంటే ప్రజలు ఏ స్థాయిలో మార్పు కోరుకుంటున్నారో అర్థం అవుతుంది. యువత కేరింతలతో, అడుగడుగునా మహిళల హారతులతో ప్రజానీకం జనసేన పార్టీకి బ్రహ్మరథం పట్టేలా ‘మహాపాదయాత్ర’ సుదీర్ఘంగా సాగింది. ఈ కార్యక్రమంలో బూరుగుపూడి జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, మండల నాయకులు, బూరుగుపూడి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.