పీఠికాపుర ప్రాంతంలో చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం ప్రాచీన సంప్రదాయం మరియు సంస్కృతి, వైభవం కోసం పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషలలో నిర్మిస్తున్న నూతన సినిమా పీఠికాపుర ప్రాంతంలో అనే సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పట్టణంలో శ్రీ కుంతీమాధవ స్వామి దివ్య సన్నిధిలో మొదటి చిత్రికరణ సన్నివేశంలో భాగంగా హాజరయ్యారు. చిత్ర బృందంనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ నాయకులు మరియు వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.