అరవ్ కు అండగా స్పెషల్ గాయిస్ ఫౌండేషన్

కవిటి మండలం, మాణిక్యపురం గ్రామానికి చెందిన జుజిస్టి బిసాయి, కవిత దంపతుల కుమారుడు అరవ్ బిసాయి హెచ్ ఎల్ హెచ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నడు. బోన్ మెరో ట్రాన్స్ ప్లాంట్ వైద్య చికిత్సకు 20లక్షలు వరకు ఖర్చు అవుతుందని చిల్డ్రన్ ఆసుపత్రి వైద్యులు సూచించారు. రోజు వారి కూలితో పూట గడిపే తాము ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసే స్తోమత లేదు అని నిరుపేద తండ్రి వాపోయాడు. ఇప్పటికే అప్పులతో సతమత మవుతున్న తమకు దాతలు స్పందించి తమ బిడ్డకు ప్రాణదానం చేయాలని కోరారు.. ఈ విషయం వివిధ ప్రచార మధ్యమాల ద్వారా తెలుసుకున్న స్పెషల్ గాయిస్ ఫౌండేషన్ 12000 రూ అరవ్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ పేద కుటుంబానికి మిగతా స్వచ్చంద సభ్యులు స్పందించి అండగా నిలబడాలని ఎస్ జి ఎఫ్ సంస్థ సభ్యులు కోరారు.